Sankranti Special Trains | సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పండుగ నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల మధ్య 32 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ నెల 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని వివరించింది. ఆయా రైళ్లను వినియోగించుకోవాలని సూచించింది. సికింద్రాబాద్ – బ్రహ్మపూర్ (07089) మధ్య జనవరి 7, 14 తేదీల్లో నడువనున్నది. బ్రహ్మాపూర్ నుంచి వికారాబాద్ (07090) జనవరి 8, 15 తేదీల్లో.. వికారాబాద్-బ్రహ్మపూర్ (07091 ) రైలు జనవరి 9, 16 తేదీల్లో నడువనున్నది.
బ్రహ్మాపూర్-సికింద్రాబాద్ (07092) రైలు జనవరి 10, 17 తేదీల్లో.. విశాఖపట్నం నుంచి కర్నూల్ సిటీ (08541) జనవరి 10, 17, 24.. కర్నూల్ సిటీ నుంచి విశాఖపట్నం (08542) మధ్య జనవరి 11, 18, 25 తేదీల్లో స్పెషల్ రైళ్లు నడుస్తాయని చెప్పింది. శ్రీకాకుళం-వికారాబాద్ (08547) మధ్య జనవరి 12, 19, 26 తేదీల్లో, వికారాబాద్- శ్రీకాకుళం (08548) మధ్య ఈ నెల 13, 20, 27 తేదీల్లో రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
సికింద్రాబాద్-తిరుపతి (02764) మధ్య ఈ నెల 10, 17 తేదీల్లో.. తిరుపతి -సికింద్రాబాద్ (02763) మధ్య ఈ నెల 11, 18 తేదీల్లో అందుబాటులో ఉంటాయని చెప్పింది. సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07271) ఈ నెల 12న, కాకినాడ టౌన్-సికింద్రాబాద్ (07272) మధ్య 13న నడువనున్నది. సికింద్రాబాద్ – బ్రహ్మపూర్ (07093) మధ్య ఈ నెల 8, 15 తేదీల్లో.. బ్రహ్మాపూర్ – సికింద్రాబాద్ (07094) మధ్య 9, 16 తేదీల్లో స్పెషల్ ట్రైన్స్ నడువనున్నాయి. నర్సాపూర్ – సికింద్రాబాద్ (07251) మధ్య నెల 10న, సికింద్రాబాద్ – నర్సాపూర్ (07252) మధ్యన జనవరి 11న రైలు నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.
SCR to Run 32 Sankranti Special Trains @drmvijayawada @drmgnt @drmhyb @drmsecunderabad pic.twitter.com/IDex9T5iPf
— South Central Railway (@SCRailwayIndia) January 2, 2024