హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే బుధవారం వెల్లడించింది. హటియా- సికింద్రాబాద్ వయా గుంటూరు డివిజన్ మీదుగా ప్రత్యేక రైలు (08615) ఈ నెల 10వ తేదీ రాత్రి హటియా స్టేషన్ నుంచి 11.55 గంటలకు బయలుదేరుతుంది.
అలాగే సికింద్రాబాద్-హటియా మధ్య ప్రత్యేక రైలు (08616) సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఈ నెల 13న రాత్రి 7.30కి బయలుదేరి బుధవారం ఉదయం 6 గంటలకు హటియా చేరుకుంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. మరోవైపు ఏపీలో కొన్ని చోట్ల డబ్లింగ్ పనులు జరుగుతున్న కారణంగా కొన్ని రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నారు. ఈ నెల 18న లింగంపల్లి-విశాఖపట్నం రైలు(12806)ను, విశాఖపట్నం-లింగంపల్లి రైలు(12805)ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.