హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు వ్యక్తిగత దూషణలు చేయడం తగదని బీఆర్ఎస్ సౌత్ఆఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తూ మన్ననలు పొందాలి గానీ, అదే పనిగా గల్లీ నాయకుడిలా దిగజారొద్దని రేవంత్కు సూచించారు. ఉద్యమనేత, పదేండ్లపాటు రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన కేసీఆర్ లాంటి వ్యక్తిపై నోటికొచ్చినట్టు మాట్లాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్కు కేవలం స్పీడ్ బ్రేకర్ లాంటివని పేర్కొన్నారు.
రేవంత్కు మతి భ్రమించింది: తుంగ బాలు
సీఎం హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన రేవంత్రెడ్డి.. చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు తుంగ బాలు ధ్వజమెత్తారు. సీఎం హోదాలో ఉంటూ మాజీ సీఎం కేసీఆర్పై ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు చేయడం చూస్తే రేవంత్కు మతి భ్రమించినట్టు కనిపిస్తున్నదని పేర్కొన్నారు. ఆరు హామీల గడువుకు వందరోజులు సమీపిస్తున్న కొద్దీ ఏమీ చేయలేక, కేసీఆర్పై చిందులేస్తున్న విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్పై అవాకులు, చెవాకులు పేలితే, ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
రేవంత్ భాషపై అభ్యంతరం:రాధారపు సతీశ్కుమార్
రాష్ట్ర మొదటి సీఎం కేసీఆర్పై రేవంత్ వ్యక్తిగత దూషణలను మానుకోవాలని ఎన్నారై బీఅర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్కుమార్ సూచించారు. పాలన చేతగాక తెలంగాణను సాధించిన కేసీఆర్పై అనుచిత వ్యాక్యలు చేయడం సరికాదని, నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, అభివృద్ధిపై దృష్టి పెట్టి ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, లేకుంటే ఎకడికకడ నిలదీస్తామని హెచ్చరించారు.