శామీర్పేట, మే 23: అక్రమంగా తరలిస్తున్న నకిలీ విత్తనాలను ఎస్వోటీ పోలీసులు గురువారం పట్టుకున్నారు.
కర్ణాటక నుంచి మంచిర్యాలకు బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ఎస్వోటీ పోలీసులు జీనోమ్ వ్యాలీ పోలీస్స్టేషన్ పరిధిలోని తుర్కపల్లి వద్ద రాజీవ్ రహదారిపై రూ.30 లక్షల విలువ చేసే విత్తనాలను పట్టుకున్నారు.