నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలంలో దారుణం జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్న తండ్రిని చంపాడో కొడుకు. మండలంలోని సార్లపల్లికి చెందిన 25 ఏండ్ల యువకుడు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మందు తాగడానికి పైసలు ఇవ్వలేదని పంచెతో తండ్రి మెడకు ఉరి బిగించి హత్యచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.