రంగారెడ్డి : రంగారెడ్డి(Rangareddy) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నవ మాసాలు పెంచి పెద్ద చేసిన కన్నతల్లినే కడతేర్చాడు(Mother death) తనయుడు. ఈ విషాదకర సంఘటన షాద్నగర్లో చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం షాద్నగర్లో నివసించే సుగుణమ్మను ఆమె కొడుకు రాత్రి విచక్షణారహితంగా దాడి(Son beats) చేశాడు. తెల్లవారే సరికి ఆమె చనిపోయింది. ఇది గమనించిన నిందితుడు తన తల్లి అనారోగ్యంతో మృతి చెందిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.