బాసర, జూలై 5 : నిర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్(బీ) గ్రామానికి ఆనుకొని ఉన్న కుంటగట్టు మీద ఇటీవల కొన్ని శిల్పాలు బయటపడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు చరిత్ర పరిశోధకులు బలగం రామ్మోహన్, మంత్రి శ్రీనివాస్ మంగళవారం పరిశీలించారు. పోరాడుతున్న వీరుల ఆహార్యాన్ని బట్టి వీరగల్లు రాష్ట్రకూటుల చివరి కాలానికి, 9వ శతాబ్దానికి చెందినదిగా వారు గుర్తించారు.
ఈ శాసనం బాగా చెదిరిపోయిందని, 5 ఫంక్తుల తెలుగన్నడి లిపి, కన్నడ భాషా శాసనంలో కర్కయ అనే వీరుని పేరు ప్రస్తావించినట్టు పరిశోధకులు తెలిపారు.