హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన సర్వే నివేదికలపై సొంత పార్టీ నేతలు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయినవాళ్లకు అనుకూలంగా, కానివాళ్లకు వ్యతిరేకంగా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవన్నీ ‘కొనుగోలు’ రిపోర్టులేనని ఆరోపిస్తున్నారు.
దాదాపు 30 స్థానాలపై ఇచ్చిన నివేదికలపై అభ్యంతరం వ్య క్తం చేస్తున్నారు. ఈ రిపోర్టులపై కొందరు నేతలు అధిష్ఠానానికి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. స్పందించిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అభ్యంతరాలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని చెప్పడం చూస్తుంటే రిపోర్టుల లొల్లి తారస్థాయికి చేరినట్టే అనిపిస్తున్నది.