హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్కు వినతిపత్రం సమర్పించారు. తమ వేతనాలు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్గా అంగన్వాడీ టీచర్లకు రూ.5 లక్షలు, సహాయకులకు రూ.3 లక్షలు ఇవ్వటంతోపాటు టీచర్కు రూ.5000, సహాయకురాలికి రూ.3000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. మంత్రిని కలిసినవారిలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి, నాయకులు గుండు సులోచన, జకుల మంగమ్మ, శిరీష తదితరులు ఉన్నారు.