హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని విజయ డెయిరీలు, చిల్లింగ్ సెంటర్లలో సౌర విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేయాలని స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ నిర్ణయించింది. విద్యుత్తు చార్జీల వ్యవయాన్ని తగించేందుకు పదో బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లోని ప్రధాన డెయిరీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8 డెయిరీలు, 11 చిల్లింగ్ సెంటర్లలో 1930 కేవీఏ సామర్థ్యంతో ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ప్లాంట్లు అందుబాటులోకి వస్తే హైదరాబాద్లోని ప్రధాన డెయిరీలో రూ.36.75 లక్షలు, జిల్లాల్లో రూ.34.18 లక్షల కరెంటు బిల్లు ఆదా కానున్నది. శనివారం హైదరాబాద్లోని ప్రధాన డెయిరీలో ప్లాంట్ నిర్మాణానికి చైర్మన్ లోక భూమారెడ్డి భూమిపూజ చేశారు.