శంషాబాద్, ఏప్రిల్: సినీ ఫక్కీలో మిక్సర్ గ్రైండర్లో భారీమొత్తంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న అస్ఘర్ అలీ అనే స్మగ్లర్ను శంషాబాద్ ఎయిర్పోర్టులో గురువారం రాత్రి అధికారులు పట్టుకొన్నారు. రూ.1.53 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన అస్ఘర్ మిక్సర్ గ్రైండర్లో 2.797 కిలోల బంగారాన్ని దాచి తీసుకొచ్చాడు. దీనిపై సమాచారం అందుకొన్న కస్టమ్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని తనిఖీ చేసి బంగారం స్వాధీనం చేసుకొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.