డోర్నకల్, సెప్టెంబర్ 6: సికింద్రాబాద్ నుంచి కోల్కతా వెళ్లే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో బుధవారం పొగలు వచ్చాయి. మహబూబాబాద్ – గుండ్రాతి మడుగు రైల్వేస్టేషన్ దిగువ లైన్లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ (నంబర్ 18046) రైలులో గార్డు బోగికి ముందు ఉన్న జనరల్ బోగిలో బ్రేక్ పట్టేయడంతో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
వెంటనే లోకోపైలట్ రైలును నిలిపివేశారు. సుమారు 30 నిమిషాల అనంతరం మరమ్మతులు చేసి రైలును పంపించారు.