హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫస్టియర్ పరీక్షల టైంటేబుల్లో స్వల్పమార్పులు చేయాలని ఇంటర్బోర్డు అధికారులు నిర్ణయించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ముందుగా ప్రకటించిన షెడ్యూల్లో రెండు రోజులపాటు పరీక్ష తేదీలను మార్చనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి తీసుకొని, ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇంటర్ సెకండియర్లోని విద్యార్థులకు ఫస్టియర్ పరీక్షలను ఈ నెల 25 నుంచి నవంబర్ రెండు వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే.