హైదరాబాద్, మార్చి 28 : వికలాంగులకు ఏరోస్పేస్ ఉత్పత్తిరంగంలో నైపుణ్యశిక్షణను లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ చేపట్టింది. ఇప్పటికే 18 మంది ట్రెయినీలను ఎంపికచేశారు. వీరికి బోయిం గ్, టాటా వంటి సంస్థల చేత శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తు తం వీరంతా తరగతి గది శిక్షణలో ఉండగా, ఆ తర్వాత ఆన్ ది జాబ్ శిక్షణ పొందుతారు. వీరికి ఏరోస్పేస్ ఉత్పత్తి పరిశ్రమ నిర్వహణ, తనిఖీ, స్టోర్స్, సేఫ్టీ, ఆడిట్ విభాగాల్లో శిక్షణ ఇస్తారు. రావిర్యాలలో ఈ శిక్షణను ప్రారంభించిన బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ గుప్తే మాట్లాడుతూ సమన్యాయం, వైవిధ్యత నవ్యతకు ఈ శిక్షణ తోడ్పాటును అందిస్తున్నదని చెప్పారు.