Telangana Assembly Elections | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. కేసీఆర్ సర్కార్లో మంత్రులుగా కొనసాగిన వారిలో ఆరుగురు ఓడిపోయారు. పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఓటమి పాలయ్యారు.
ఖమ్మం నియోజకవర్గంలో పువ్వాడ అజయ్పై తుమ్మల నాగేశ్వర్ రావు, నిర్మల్లో ఇంద్రకరణ్ రెడ్డిపై మహేశ్వర్ రెడ్డి, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్పై ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్, వనపర్తి నియోజకవర్గంలో నిరంజన్ రెడ్డిపై తుడి మేఘా రెడ్డి, పాలకుర్తిలో దయాకర్ రావుపై యశస్విని రెడ్డి, మహబూబ్నగర్లో శ్రీనివాస్ గౌడ్పై యెన్నం శ్రీనివాస్ రెడ్డి గెలిచారు.
ఆరుగురు మంత్రులపై గెలిచిన వారంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులే. కేవలం నిర్మల్లో మాత్రమే మహేశ్వర్ రెడ్డి బీజేపీ తరపున గెలిచారు. ఎర్రబెల్లి దయాకర్ రావుపై పోటీ చేసిన యశస్విని రెడ్డి తొలిసారిగా గెలిచారు. తుడి మేఘా రెడ్డి కూడా తొలిసారి అసెంబ్లీ గడప తొక్కనున్నారు. ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు.