పెద్దపల్లి: జిల్లాలోని సింగిరెడ్డిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సింగిరెడ్డిపల్లి వద్ద గోదావరిఖని-మంథని రహదారిపై అదుపుతప్పి ఓ కారు బోల్తాపడింది. దీంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను కరీంనగర్ దవాఖానకు తరలించారు. బాధితులు బెల్లంపల్లికి చెందిన కానిస్టేబుల్, అతని కుటుంబసభ్యులని తెలిపారు. మేడారం జాతరకు వెళ్లి తిరిగివస్తుండగా సింగిరెడ్డిపల్లి వద్ద ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.