TSPSC Paper Leak | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కస్టోడియన్ శంకరలక్ష్మి డైరీని సిట్ సీజ్ చేసింది. ప్రశ్నపత్రాలు ఉన్న కంప్యూటర్ పాస్వర్డ్ను కస్టోడియన్ శంకరలక్ష్మి డైరీ నుంచి దొంగిలించామని ప్రధాన నిందితులు ప్రవీణ్కుమార్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్రెడ్డి వెల్లడించడంతో సిట్ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్ పాస్వర్డ్ను కస్టోడియన్.. డైరీ చివరి పేజీలో రాసినట్టు నిందితులు చెప్పారు.
దీంతో కస్టోడియన్ శంకరలక్ష్మిని కూడా సిట్ ప్రశ్నించింది. తాను డైరీలో ఎక్కడా పాస్వర్డ్ రాయలేదని ఆమె చెప్పినట్టు తెలిసింది. అధికారులు ఆ డైరీని పరిశీలించగా, పాస్వర్డ్ ఆనవాలు ఎక్కడా కనిపించలేదు. శంకరలక్ష్మి తన సిస్టమ్కు బలమైన పాస్వర్డ్లు పెట్టుకోకపోవడంతో రాజశేఖర్రెడ్డి సునాయాసంగా ఆ సిస్టమ్లోని ప్రశ్నపత్రాలున్న ఫోల్డర్లోకి ఎం ట్రీ అయ్యాడని సిట్ దర్యాప్తులో వెల్లడయ్యింది. మరోవైపు ఈ కేసులో శుక్రవారం డీఏవో (డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్) ప్రశ్నపత్రాన్ని ప్రవీణ్ నుంచి కొనుగోలు చేసిన ఖమ్మంకు చెందిన లౌకిక్, సుశ్మిత దంపతులను సిట్ కస్టడీకి తీసుకుంది.