హైదరాబాద్: టీఎస్పీఎస్సీ (TSPSC) కేసులో విచారణ ముమ్మరంగా సాగుతున్నది. పేపర్ లీకేజీ వ్యవహారంలో నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి (BJP chief Bandi sanjay) సిట్ (SIT) మారోసారి నోటీసులు (Notice) జారీ చేసింది. ఆదివారం తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. పేపర్ లీక్ (Paper leak) కుంభకోణంలో చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని, ఆధారాలను సమర్పించాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. గత మంగళవారం బండి సంజయ్కి సిట్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉండగా దూరంగా ఉన్నారు. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా తాను ఢిల్లీలో ఉన్నానని, సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నందున హాజరుకాలేనంటూ సిట్కు బండి సంజయ్ లేఖ రాశారు. ఈనేపథ్యంలో తాజాగా మరోసారి సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీచేశారు.
Telangana | SIT officials arrived at State BJP Chief Bandi Sanjay's residence to serve a notice to him in connection with TSPSC leak issue.
Earlier he was summoned, asking him to appear before the officials to answer a few questions relating to the claim he made. pic.twitter.com/ZDVoBFfXb2
— ANI (@ANI) March 25, 2023
ఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి మంగళవారం సిట్ నోటీసులు జారీ చేసింది. బంజారాహిల్స్లోని ఇంట్లో ఆయన లేకపోవడంతో నివాసం వద్ద నోటీసులను అంటించారు. ‘జగిత్యాల జిల్లాలోని ఓ మండలంలో 50 మందికిపైగా గ్రూప్-1లో క్వాలిఫై అయ్యారు. అందులో బీఆర్ఎస్ నేతల కొడుకులు, నలుగురు సర్పంచుల కొడుకులు, సింగిల్ విండో చైర్మన్ కొడుకుతోపాటు జడ్పీటీసీ వద్ద బాడీగార్డుగా పనిచేసే వ్యక్తి కొడుకు. ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు క్వాలిఫై అయ్యారు. ఒక సర్పంచ్ కొడుకుకు అర్హత అయ్యే అవకాశమే లేనప్పటికీ క్వాలిఫై అయ్యాడు’ అని చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని నోటీసుల్లో సిట్ పేర్కొన్నది. పూర్తి సమాచారం సిట్కు ఇచ్చి దర్యాప్తుకు సహకరించాలని, అందుకు 24వ తేదీ ఉదయం 11 గంటలకు హిమాయత్నగర్లోని సిట్ కార్యాలయంలో హాజరుకావాలని బండికి ఆదేశాల్లో పేర్కొన్నది. అయితే ఆయన విచారణకు గైర్హాజరయ్యారు.