హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ శాసనమండలి సమావేశాలు సాగుతున్న తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టుగా ఉన్నాయని ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. కౌన్సిల్ మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రజా సమస్యలను ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసి పోలీసుల సాయంతో సభను నెట్టుకొస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సభ బయట పోలీసులతో, సభ లోపల మార్షల్స్తో భయానక వాతావరణం సృష్టించి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై చర్చించే చిత్తశుద్ధి ఏమాత్రం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి సోదరుడికి కోట్ల రూపాయల విలువైన భూములను కారుచౌకగా కట్టబెట్టారని, దీనిపై పారదర్శకమైన చర్చ జరగాలని తాము వాయిదా తీర్మానం ఇస్తే దానిని ఏకపక్షంగా తిరసరించారని మండిపడ్డారు. ఒకవైపు సాగునీరు అందక అన్నదాతలు అల్లాడుతున్నారని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రాక లక్షలాది మంది విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తంచేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చావు కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో తక్షణమే స్పష్టం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి డిమాండ్చేశారు. కౌన్సిల్ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఇంట్లో ఉంటే అకడికి చావు డప్పులు పంపించే దిగజారుడు సంసృతి ఏమిటని మండిపడ్డారు. కేసీఆర్ మరణాన్ని కోరుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేను ఇప్పటికీ స్వేచ్ఛగా రోడ్లపై తిరగనివ్వడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషేధిత ఆస్తుల జాబితా (పీవోబీ) నుంచి ఒక ఎకరం భూమిని తొలగించాలన్నా ఐఏఎస్ అధికారులకు కనీస అధికారం లేకుండా చేశారని నిప్పులు చెరిగారు.