హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవుల పందేరానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్గా వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, వక్ఫ్ బోర్డు చైర్మన్గా అజ్మతుల్లా హుసేన్ను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ అధికారిక తెలంగాణ మాస పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా కోడూరి శ్రీనివాస్రావును నియమించింది.
స్టేట్ ఫైనాన్స్ కమిషన్లో సభ్యులుగా ఎం రమేశ్, సంకేపల్లి సుధీర్రెడ్డి, మాలోత్ నెహ్రూ నాయక్ను నియమించింది. రెండు మూడు రోజులలో మరిన్ని నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నట్టు తెలిసింది.