సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 4: సిరిసిల్ల దవాఖానలోని ప్రసూతి విభాగం అరుదైన ఘనత సాధించింది. గతం లో ఎన్నడూ లేనివిధంగా ప్రసవాల్లో రికార్డు సృష్టించిం ది. గత నెలలో ఏకంగా 330 డెలివరీలు చేసి టాప్లో నిలిచింది. మాతాశిశు సంరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలిచిన దవాఖానలు.. స్వరాష్ట్రంలో పుట్టింటిని మరిపించే రీతి లో తల్లీబిడ్డలకు భరోసానిస్తున్నాయి. ఇందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్ద దవాఖానే నిదర్శనంగా నిలుస్తున్నది.
మంత్రి కేటీఆర్ కృషితో అధునాతన వసతులు సమకూర్చుకొని ప్రసూతి సేవల్లో దూసుకెళ్తున్నది. గత కొన్నేండ్లుగా ప్రతి నెలా దాదాపు 320 ప్రసవాలు జరుగుతున్నాయి. నవంబర్లో అత్యధికంగా 330 ప్రసవాలు నమోదయ్యాయి. వీటిలో 207 సిజేరియన్, 123 సాధారణ ప్రసవాలు కావడం గమనార్హం. మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో ప్రసవాల నమోదు గణనీయంగా పెరుగుతున్నదని దవాఖాన సూపరింటెండెంట్ మురళీధర్రావు తెలిపారు. ప్రసవాల సంఖ్య పెంపునకు కృషిచేసిన సూపరింటెండెంట్ మురళీధర్రావు, వైద్యులు, సిబ్బందిని కలెక్టర్ అనురాగ్ జయంతి అభినందించారు.