హైదరాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి పీయూ ష్ గోయల్ బరితెగించి మాట్లాడారని, ధాన్యం కొనుగోళ్లపై ఆయన చెప్పినవ న్నీ అబద్ధాలేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్ర హం వ్యక్తంచేశారు. కొందరు ముఖ్యమంత్రులు కేంద్రాన్ని బెదిరించారని గోయల్ చెప్పుకోవడం సిగ్గుచేటని మం డిపడ్డారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. సమస్యలపై ప్ర భుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరించినట్టా? అని నిలదీశారు. గతంలో మోదీ కూడా కేంద్రాన్ని ప్రశ్నించారని, ఆయనది కూడా బెదిరింపేనా? అని ప్రశ్నించారు. రైతుల సమస్యపై బాధ్యాతరాహిత్యంగా మాట్లాడుతున్న గోయల్కు కేంద్రమంత్రిగా కొనసాగే అర్హత లేదని అన్నారు. కేంద్రం రాసుకున్న ఫార్మాట్లో రాష్ర్టాల నుంచి బలవంతంగా లేఖలు తీసుకొని, బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ ఇచ్చారంటూ రాష్ర్టాలపై నిందలు వేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. తెలంగాణలో యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తుందని, రా రైస్ ఇవ్వాలంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రా రైస్గా మార్చడం వల్ల వచ్చే నష్టాన్ని కేంద్రం ఎందుకు భరించదని నిలదీశారు. ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోవడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. రారైస్గా చేసుకుంటారో ? బాయిల్డ్ రైస్ చేసుకుంటారో ? వారిష్టమని పేర్కొన్నారు. రాష్ర్టానికో వాతావరణం ఉంటే అన్ని రాష్ర్టాలకు ఒకే నిబంధన పెట్టడం మూర్ఖత్వమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ధాన్యం కొనుగోళ్లపై ఈటల రాజేందర్ వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శనమని నిరంజన్రెడ్డి తిప్పికొట్టారు. ఐదేండ్లు పౌరసరఫరాలశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలు తెలిసిన వ్యక్తి ఇలా మాట్లాడటం బాధాకరం, బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. కేంద్రాన్ని ఒప్పించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనడం సిగ్గుచేటని మం డిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు తెలంగాణ రైతుల కోసం చేసిందేమిటని ప్రశ్నించారు. ‘రైతులు వరే సాగు చేయాలి. కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది, కేసీఆర్తో మీకు సంబంధం లేదు’ అం టూ బీరాలు పలికిన అల్పుడు ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నాడని ప్రశ్నించారు. బీజేపీ బడా కార్పొరేట్ల, బడా వ్యాపారుల పార్టీ అని, రైతుల, పేదల సంక్షేమా న్ని ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. తమకు ఎవరు మేలు చేస్తున్నారో.. ఎవరు రాజకీయం చేస్తున్నారో రైతులు గమనిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీని సాగనంపితేతప్ప రైతులు బాగుపడరని అన్నారు.