హైదరాబాద్ : ప్రకృతి కన్నతల్లి లాంటిది. కన్నతల్లిని ఎలా ప్రేమగా చూసుకుంటామో.. అదే విధంగా ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ప్రముఖ సింగర్ సునీత అన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా.. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో ఆమె మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని ఆమె సూచించారు.
పర్యావరణాన్ని పరిరక్షించి, రాబోయే భావి తరాలకు మంచి వాతావరణం అందిద్దామని సునీత పిలుపునిచ్చారు. అనంతరం సినీ గేయ రచయితలు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, డైరెక్టర్ నందిని రెడ్డికి గ్రీన్ ఇండియా చాలెంజ్ సవాల్ విసిరారు.