హైదరాబాద్ : సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. నాలుగు బొగ్గు గనుల ప్రయివేటీకరణను వేలం వేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయాన్ని టీబీజీకేఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సమ్మె నోటీసు ఇచ్చింది. డిసెంబర్ 9వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని టీబీజీకేఎస్ ప్రకటించింది. కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం చేస్తామని సింగరేణి కార్మికులు స్పష్టం చేశారు. కల్యాణ్ ఖని బ్లాక్ -6, కోయగూడెం బ్లాక్ -3, సత్తుపల్లి బ్లాక్ -3, శ్రావణపల్లి బొగ్గు గనులను వేలం వేయాలని కేంద్రం నిర్ణయించింది.