పెద్దపల్లి: జిల్లాలోని గోదావరిఖనిలో సింగరేణి కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇంట్లో నిద్రిస్తున్న కార్మికుడిని దుండగులు కనతపై కాల్చి చంపారు. గోదావరిఖనిలోని గంగానగర్కు చెందిన పొరకొప్పుల రాజేందర్ అనే కార్మికుడు శ్రీరాంపూర్ ఏరియా గనుల్లో పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆయన ఇంట్లో నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు ఆయన తలపై తుపాకీతో కాల్చారు. పాయింట్ బ్లాక్లో కాల్చడంతో నిద్రలోనే అనంతలోకాలకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేపట్టారు.