హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): సింగరేణి పరిసర ప్రాంతాల్లో చేస్తున్న సేవా కార్యక్రమాలతో రూపొందించిన లఘు చిత్రానికి సీఎస్ఆర్ పురస్కారం లభించింది. గురువారం హైదరాబాద్లోని టూరిజం ప్లాజా హోటల్లో నిర్వహించిన పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) హైదరాబాద్ చాప్టర్ స్వర్ణోత్సవాల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ సింగరేణి జీఎం కే సూర్యనారాయణకు పురస్కారాన్ని అందజేశారు. అలాగే, బెస్ట్ మ్యాగజైైన్, బెస్ట్ కవర్ డిజైన్, బెస్ట్ బ్రోచర్, బెస్ట్ మెసేజ్ ఆఫ్ చీఫ్ ఎగ్జిక్యూటి వ్ విభాగంలోనూ అవార్డులు దక్కాయి.
సీనియర్ క మ్యూనికేషన్ ఆఫీసర్ గణాశంకర్ పూజారికి జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ మోడెర్న్ పబ్లిక్ రిలేషన్స్ విభాగంలో ఎన్ఎండీసీ నాలుగు విభాగాల్లో మొదటి స్థానాన్ని గెలుచుకొన్నది. ఎన్ఎండీసీ ఈడీ ప్రవీణ్ కుమార్, డీజీఎం సీహెచ్ శ్రీనివాసరావు అవార్డులు స్వీకరించారు.