4 బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్
కరపత్రాలతో అవగాహన కల్పించిన కార్మిక నాయకులు
మంచిర్యాల, ఫిబ్రవరి 4 : లాభాల బాటలో నడుస్తున్న సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుటిలయత్నం చేస్తున్నదని టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు మండిపడుతున్నారు. సింగరేణిలోని నాలుగు బ్లాకులను వేలం వేసి కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుట్రకు తెరలేపిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంస్థను కాపాడుకొనేందుకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కార్మికులకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా శుక్రవారం అన్ని గనుల వద్ద కార్మికులు, ఉద్యోగులకు కరపత్రాలు పంపిణీ చేశారు. బీజేపీ హఠావో, సింగరేణి బచావో.. అంటూ నినాదాలు చేశారు. గేట్ మీటింగ్లు ఏర్పా టుచేశారు. నాలుగు బ్లాకుల వేలం, సింగరేణి ప్రైవేటీకరణతో కలిగే నష్టాలను వారు వివరించారు.