భద్రాద్రి: సింగరేణి (Singareni) జూనియర్ అసిస్టెంట రాత పరీక్ష నేడు జరుగనుంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. సింగరేణి కాలరీస్లో ఖాళీగా 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం 98,882 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికోసం ఎనిమిది జిల్లాల్లో 187 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. వారం రోజుల్లో ప్రాథమిక కీని విడుదల చేస్తామని వెల్లడించారు.