కాసిపేట: సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై కార్మిక లోకం భగ్గుమన్నది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ ప్రయత్నాలపై రగిలిపోతున్న బీజేపీ, దాని అనుబంధ సంఘాల నాయకులకు అడుగడుగున అడ్డుకుంటున్నారు. బీఎంఎస్ (BMS) ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి యాత్రలో భాగంగా మందమర్రి ఏరియాలోని కాసిపేట గనికి వచ్చిన నాయకులకు కార్మికులు చుక్కలు చూపించారు. సమావేశంలో బీఎంఎస్ నేతలు ప్రసంగిస్తుండగా కార్మికులు, టీబీజీకేఎస్ నాయకులు అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. జై తెలంగాణ అంటూ వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.
బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను, ఇన్కంటాక్స్ రద్దుపై స్పష్టమైన విధానాన్ని తెలిపే వరకు గనుల్లోకి రావద్దని స్పషం చేశారు. ఏ ముఖం పెట్టుకుని వచ్చారని నిలదీశారు. దీంతో చేసేదేంలేక బిఎంఎస్ నాయకులు వెనుదిరిగి వెళ్లిపోయారు.