Singareni Elections | సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఎన్నికల పోలింగ్ మొదలు కాగా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ముగిసిన తర్వాత ఫలితాలను ప్రకటించనున్నారు. ఇక బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలను నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం పరిధిలోని 11 డివిజన్లలో పోలింగ్ నిర్వహించేందుకు ఆరు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోసం 84 పోలింగ్ కేంద్రాలు, 11 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు తలపడుతుండగా.. 11 ఏరియాల పరిధిలో 39,827 మంది కార్మికులు ఓటు ఓటు వేయనున్నారు. సింగరేణి ఎన్నికల అధికారిగా శ్రీనివాసులు వ్యవహరిస్తుండగా.. ఎన్నికల విధుల్లో 650 మంది పాల్గొన్నారు.