హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ)కు నూతన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైన సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ను పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. సోమవారం సింగరేణి భవన్లో సీఎండీ శ్రీధర్ను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.
సీఎండీగా సింగరేణి సంస్థను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని, సంస్థ ఉజ్వల భవిష్యత్తు కోసం ముందుచూపుతో ఎన్నో నూతన ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించారని వారు కొనియాడారు. దేశంలోని దిగ్గజ సంస్థకు సార థ్యం వహించే అవకాశం సింగరేణి సీ ఎండీకి లభించడంపట్ల ఆ సంస్థ డైరెక్టర్లు ఎన్ బలారం, డీ సత్యనారాయణరావు, ఎన్వీకే శ్రీనివాస్, జీ వెంకటేశ్వర్రెడ్డి, జీఎం ఎం సురేశ్ హర్షం వ్యక్తంచేశారు.