హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ జనవరిలో 68.4 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇదే సంస్థ 2016లో నమోదైన 64.7 లక్షల టన్నుల రికార్డును అధిగమించి, జనవరిలో మొత్తం 11 ఏరియాల నుంచి సగటున రోజుకు 39 బండ్ల చొప్పున మొత్తం 1,216 ర్యాక్ల ద్వారా బొగ్గు రవాణా జరిపింది. తెలంగాణ జెన్కోతో పాటు ఇతర రాష్ర్టాల థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు బొగ్గు పంపింది. 2022 డిసెంబరులో 1,186 ర్యాక్ల ద్వారా బొగ్గు రవాణా జరగ్గా, జనవరిలో 1,216 ర్యాక్లకు పెరిగింది.
ఓబీ తొలగింపులో మరో రికార్డు
సింగరేణి సంస్థ చరిత్రలో తొలిసారిగా మంగళవారం (31.1.2023) ఉదయం షిఫ్టు నుంచి రాత్రి షిఫ్టు వరకు అత్యధికంగా 16.67 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను తొలగించి రికార్డు సృష్టించింది.
వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని దాటుతాం
జనవరి నెలలో నిర్దేశించిన లక్ష్యాల్లో ఆల్టైం రికార్డులు సాధించడం హర్షణీయం. ఇక 700 లక్షల టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని దాటుతామనే నమ్మకం కలిగింది.
– ఎన్ శ్రీధర్, సింగరేణి సీఎండీ