హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం 32 రోజులకు రూ.2 కోట్ల 23 లక్షల 32 వేల 228 వచ్చినట్లు ఈవో డీ భ్రమరాంబ తెలిపారు. సింహగిరిపై స్వామివారి ఆలయ బేడా మండలంలో స్వామివారి హుండీని లెక్కించారు.
ఇందులో నగదుతో పాటు 206 గ్రాముల బంగారం, 16.732 కిలోల వెండి లభించినట్టు ఈవో పేర్కొన్నారు. అలాగే దేవస్థానం అనుబంధ పైడితల్లి ఆలయానికి 8 లక్షల 8 వేల 740 రూపాయలు వచ్చినట్టు తెలిపారు.