భువనగిరి: యాదగిరిగుట్టపై కొలువుదీరి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి హైదరాబాద్కు చెందిన మహాలక్ష్మి గ్రూప్ కంపెనీ అధినేతలైన వినుకొండ చంద్రారెడ్డి, లక్ష్మి దంపతులు రెండు బంగారు చెడీలు, మరో ఐదు కలశాలు బహూకరించారు. రెండు లక్షల రూపాయల విలువచేసే రెండు కేజీల బరువున్న ఐదు వెండి కలశాలను వినుకొండ చంద్రారెడ్డి దంపతులు స్వయంగా అందజేశారు.
వినుకొండ చంద్రారెడ్డి దంపతుల తరఫున ఆయన ప్రతినిధులు ఏ పురుషోత్తం, భాస్కర్, హర్షవర్ధన్ రెండు బంగారు పూతతోగల చెడీలను స్వామివారికి సమర్పించారు. అదేవిధంగా 10 లక్షల విలువ గల సామగ్రిని అందజేశారు.