డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో భాగంగా బుధవారం కేటీఆర్ను కలిసిన సేల్స్ఫోర్స్ సీఎఫ్వో అమీ వీవర్ ట్విట్టర్లో.. ‘రెండేండ్ల తర్వాత కేటీఆర్ను కలుసుకోవడం సంతోషంగా ఉన్నది. ప్రపంచానికి హైదరాబాద్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న
డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో భాగంగా బుధవారం కేటీఆర్ను కలిసిన సేల్స్ఫోర్స్ సీఎఫ్వో అమీ వీవర్ ట్విట్టర్లో.. ‘రెండేండ్ల తర్వాత కేటీఆర్ను కలుసుకోవడం సంతోషంగా ఉన్నది. ప్రపంచానికి హైదరాబాద్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మీ నాయకత్వానికి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.
హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌషల్ దావోస్లోని తెలంగాణ పెవిలియన్లో మంత్రి కేటీఆర్తో భేటీ అయ్యారు. తెలంగాణలో ఆర్అండ్డీ విస్తరణతోపాటు హైస్పీడ్ రైల్ సిస్టమ్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి హిటాచీ బృందానికి ఆహ్వానం పలికారు.
భారతదేశ అగ్రగామి ఎడ్టెక్ సంస్థ బైజూస్ సహ-వ్యవస్థాపకులు రవీంద్రన్, దివ్య గోకుల్నాథ్ మంత్రి కేటీఆర్తో భేటీ అయ్యారు. అభ్యసన కేంద్రాల ఏర్పాటు, నిరుపేద పిల్లలకు మెరుగైన విద్యను అందుబాటులోకి తేవడం, తెలంగాణ ప్రభుత్వ సమన్వయంతో బైజూస్ చేపట్టనున్న కార్యక్రమాలు తదితర అంశాలపై ఈ సందర్భంగా వారు చర్చించారు.