సిద్దిపేట : అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. సిద్దిపేట పట్టణానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లో ఆర్థిక మంత్రి హరీశ్రావు సమక్షంలో వారంతా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి ఆ నాయకులకు గులాబీ కండువాలు కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ దారిపల్లి శ్రీనివాస్, పట్టణ బీజేపీ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఎండీ ఇబ్రహీం, పట్టణ కాంగ్రెస్ నాయకులు కృష్ణపురం బాబుతో పాటు ఇరు పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు ఉన్నారు. గత 8 ఏండ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితమై, టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. పార్టీ కార్యకర్తలను టీఆర్ఎస్ కాపాడుకుంటుందని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు.