సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని (Siddipet) చిన్నకోడూరు మండలం రామునిపట్లలో విషాదం చోటుచేసుకున్నది. భార్యా, ఇద్దరు పిల్లలతో సహా తుపాకీతో కాల్చుకుని కలెక్టర్ గన్మెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆకుల నరేశ్ అనే కానిస్టేబుల్ కలెక్టర్ గన్మెన్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన నరేశ్.. తన భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కూతురు హిమశ్రీని తుపాకీతో కాల్చాడు. అనంతరం తానుకూడా కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాల గురించి ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల విషయంలో భార్యా భర్తల మధ్య గొడవ జరిగిందని తెలుస్తున్నది. గొడవ తీవ్రరూపం దాల్చడంతో ఆగ్రహానికి లోనైనా నరేశ్.. స్కూల్కి వెళ్లిన పిల్లలను ఇంటికి తీసుకువచ్చాడు. మొదట భార్యను తుపాకీతో కాల్చి.. పిల్లలను కూడా కాల్చిచంపాడు. అనంతరం తాను ఆత్మహత్యచేసుకున్నాడు. ఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలను సేకరిస్తున్నది.