హైదరాబాద్ : ప్రకృతిని కాపాడాలనే బృహత్తర లక్ష్యంతో సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన తెలంగాణ హరిత నిధిలో తాను సైతం భాగస్వామినవుతానని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద పటేల్ ప్రకటించారు. వాతావరణ సమతుల్యత కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను ఒక ఉద్యమంలా కొనసాగిస్తున్న రాజ్యసభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ స్ఫూర్తితో..హరితనిధికి తన జీతం నుంచి ప్రతి నెల 500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు శుభప్రద్ పటేల్ తెలిపారు.
ప్రకృతి సంరక్షణతోనే సర్వ జీవాలు జీవనం సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్ భావించి..హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొక్కలు నాటాడాన్ని బృహత్తర ఉద్యమంలా ముందుకు నడిపిస్తన్నారని శుభప్రద్ పటేల్ కొనియాడారు.
హరిత నిధిని తీసుకురావడం గొప్ప సాహోసోపేత నిర్ణయమన్నారు. సీఎం కేసీఆర్ మంచి లక్ష్యంతో తీసుకువచ్చిన హరిత నిధి అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని శుభప్రద్ పటేల్ పిలుపునిచ్చారు.