నాగర్కర్నూల్ :బల్మూర్ మండల పరిధిలోని కొండనాగుల గ్రామాన్ని జిల్లా కలెక్టర్ శర్మన్ సందర్శించారు. గ్రామంలో రోడ్ల వెంబడి అవెన్యూ ప్లాంటేషన్, పారిశుద్ధ్య కార్యక్రమాలు పక్కాగా అమలు చేయకపోవడంపైకలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. గ్రామ పంచాయతీలో గ్రీన్ బడ్జెట్ 10 శాతం నిధులు ఉన్నప్పటికి రోడ్లకు రెండువైపులా పూర్తిస్థాయిలో మొక్కలు నాటలేదు.
నాటిన కొద్దిపాటి మొక్కలకు సరైన సంరక్షణ చర్యలు తీసుకోకపోవడంతో పాటు గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు విధిగా నిర్వర్తించకపోవడం పట్ల షోకాజ్ నోటీస్ జారీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రెండు రోజుల్లో ఆశించిన ప్రగతి కనబడకుంటే విధుల నుంచి సస్పెన్షన్ చేస్తానని కలెక్టర్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
రేపటి నుంచి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుంది : ఎల్. రమణ
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ
అక్రమంగా పట్టా చేసుకున్నాడని.. పంట పొలంలోనే కట్టేశారు
ఇల్లందకుంటలో దళితుల భారీ ర్యాలీ