హైదరాబాద్, మార్చి 21(నమస్తే తెలంగాణ) : ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్తో దూసుకుపోతున్న తరు ణంలో ఇంకా విద్యార్థులు ఒంటి.. రెంటికి ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొన్నది. తాజా బడ్జెట్లో రూ.26వేల కోట్ల కేటాయించడమే దీనికి నిదర్శనం. రాష్ట్రంలోని స్కూళ్లల్లో 17% బడుల్లో బాలురకు.. 9% బడుల్లో బాలికలకు టాయిలెట్లు లేవు. ఈ విషయం సోషియో ఎకనమిక్ ఔట్లుక్-2026లో వెల్లడైంది. బడ్జెట్ సందర్భంగా ఈ నివేదికను సర్కార్ అసెంబ్లీకి సమర్పించగా, పలు ఆసక్తికర విషయాలు బహిర్గతమయ్యాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి మొత్తం 39,641 స్కూళ్లున్నాయి. వీటిలో 62.36లక్షల విద్యార్థులు ఉన్నా రు. పలు బడుల్లో వసతుల్లేవని తేల్చింది.
ప్రైవేట్తో పోల్చితే సర్కార్లో సగమే..
రాష్ట్రంలోని సర్కార్ బడులు రానురాను నిర్వీర్యమవుతున్నాయి. ఎన్రోల్మెంట్ గణనీయంగా తగ్గుతున్నది. గణాంకాలను పరిశీలిస్తే.. ప్రైవేట్ బడుల్లోని వి ద్యార్థుల సంఖ్యలో సగం కూడా సర్కార్ బడుల్లో లేవు. రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ల సంఖ్య 11,689 ఉండగా, వీటిల్లో ఏకంగా 37,43,893గా ఉంది. అంటే ప్రైవేట్ స్కూళ్ల సంఖ్య తక్కువగా ఉండగా, ఎన్రోల్మెంట్ అధికంగా ఉంది. అదే సర్కార్ బడుల సంఖ్య ఎక్కువగా ఉండగా, ఎన్రోల్మెంట్ చాలా తక్కువగా ఉన్నది.
మరికొన్ని విషయాలిలా..