హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సంచలనం రేపుతున్న హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనను కస్టడీలోకి తీసుకుని గత 8 రోజులుగా విచారణ జరిపిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు.. న్యాయస్థానానికి సమర్పించిన కన్ఫెషన్ రిపోర్ట్లో పలు విషయాలను వెల్లడించారు. ఒక్కో భారీ సెటిల్మెంట్కు శివబాలకృష్ణ రూ.కోటి వరకు ముడుపులు తీసుకున్నాడని, ఆయన ద్వారా పురపాలక శాఖలో పనిచేసిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అడ్డగోలుగా అనుమతులు పొందాడని తెలుస్తున్నది. ఆ ఐఏఎస్ ఒ త్తిడితో నార్సింగిలో 12 ఎకరాల వివాదాస్పద భూమికి శివబాలకృష్ణ క్లియరెన్స్ ఇచ్చినట్టు పేర్కొన్నారు.
ఆ భూమిలో ఎస్ఎస్వీ ప్రాజెక్టుకు అనుమతి ఇప్పించేందుకు ఆ ఐఏఎస్ 10 కోట్లు డిమాండ్ చేయడంతో అడ్వాన్స్గా షేక్ సైదా అనే వ్యక్తి రూ.కోటి చెల్లించినట్టు సమాచారం. ఆ నగదు శివ బాలకృష్ణ ద్వారా ఆ ఐఏఎస్కు చేరిందని, వారిద్దరి మధ్య ఉన్న సఖ్యతతో ఆ ఐఏఎస్కు వెర్టెక్స్ హోమ్స్లో ఓ ఫ్లాట్ను రిజిస్ట్రేషన్ చేశారని తెలిసింది. శివబాలకృష్ణకు సంబంధించిన అక్రమాస్తుల పత్రాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులకు మరో ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారుల ఆస్తుల పత్రాలు కూడా దొరికినట్టు సమాచారం. దీంతో వారికి నోటీసులు జారీ చేసి, విచారించాలని ఏసీబీ నిర్ణయించింది.
అనుమతి నివ్వాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిం ది. డీవోపీటీ అనుమతి లేకుండా ఇద్దరు మా జీ ఐఏఎస్లు అక్రమంగా మహబూబ్నగర్, యాదాద్రి జిల్లాల్లో ఆస్తులు కొన్నట్టు వార్త లొచ్చాయి. తన పేరు ఉండటంపై మాజీ ఐఏఎస్ అధికారి రజత్కుమార్ స్పందించారు. జీఏడీ పర్మిషన్తో 2013లో కొనుగోలు చేసిన భూమిని 2021లో అమ్మినట్టు వివరణ ఇచ్చారు. శివబాలకృష్ణ అక్రమాల్లో ఆయన సోదరుడు శివనవీన్కుమార్ కీలకంగా వ్యవహరించినట్టు ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి.