కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. పీసీసీ ప్రధాన కార్యదర్శి చల్మెడ లక్ష్మినర్సింహారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ తనకు రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటతోనే తనను ఓడించినట్లు ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ గెలవడం కన్నా టీఆర్ఎస్ను ఓడించమే లక్ష్యంగా పని చేస్తుందన్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో లోపాయికారి ఒప్పందంతో ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కు ఉప ఎన్నికల్లో 3వేల ఓట్లు రావడం కాంగ్రెస్ పార్టీ నాయకుల పనితీరుకు నిదర్శనమన్నారు.
కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషం వరకు అభ్యర్థిని ప్రకటించక బయటి వ్యక్తిని తీసుకువచ్చి కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యారన్నారు. కొత్త పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ భవనంలో కుమ్ములాటలు జరుగుతున్నాయన్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రతిపక్ష పాత్ర పోషించలేక విఫలం చెందిందన్నారు.
ఆ పార్టీకి భవిష్యత్ లేదని నిర్ణయించుకున్నాక, తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధిలో తాను భాగస్వామ్యం కావాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 8వ తేదిన తెలంగాణ భవన్లో అనుచరులతో కలిసి తాను టీఆర్ఎస్ భవన్లో పార్టీ కండువా కప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
Kumrambhim Asifabad | అడా ఎస్బీఐ బ్యాంక్లో భారీ చోరీ
యాదాద్రి స్వర్ణతాపడానికి ఎమ్మెల్యే దానం రూ. 55 లక్షల విరాళం
Mulugu | రోడ్ రోలర్ను దహనం చేసిన మావోయిస్టు మిలిటెంట్ అరెస్ట్