నల్గొండ : మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్కు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన గుడ్డిమొల్కాపూర్, పులిపలుపుల ఎంపీటీసీలు టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి జగదీశ్రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీటీసీలు కవితా విద్యాసాగర్, బోలుగురి లింగయ్య టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, తుంగతుర్తి ఎమ్మెల్యే గాధరి కిశోర్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కుసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.
మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
రావిగూడెం సర్పంచ్ గుర్రం సత్యం (రాష్ట్ర సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శి), చొల్లేడు గ్రామ సర్పంచ్ జనిగల మహేశ్వరి సైదులు యాదవ్, కిష్టాపురం సర్పంచ్ నందిపాటి రాధా రమేశ్, కిష్టాపురం ఎంపీటీసీ భీమనపల్లి సైదులు, కల్వలపెళ్లి సర్పంచ్ వంటెపాక జగన్ గౌడ్, జమిస్తాన్పల్లి సర్పంచ్ పంతంగి పద్మ ఉన్నారు. ఈ సందర్భంగా మధుసూదనచారి, జీవన్రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
టీఆర్ఎస్లో చేరిన వారంతా ఇంతకు ముందు కోమటరెడ్డి రాజగోపాల్రెడ్డి అనుచురులు కాగా.. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి.. బీజేపీలో చేరేందుకు యత్నిస్తుండగా.. ఆయన మద్దతుదారులు టీఆర్ఎస్లో చేరడం గమనార్హం.