ములుగు : ప్రముఖ సంగీత వాయిద్య కారుడు శివమణి రామప్పకు చేరుకున్నారు. రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రామప్ప శిల్ప కళావైభవానికి ముగ్ధుడైన శివమణి ఫొటోలు దిగుతూ సందడి చేశారు.
కాగా, రామప్ప దేవాలయ ప్రాంగణంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం నిర్వహించే రామప్ప వైభవం కార్యక్రమంలో పాల్గొనేందుకు శివమణి రామప్పకు చేరుకున్నారు.