యాదాద్రి భువనగిరి : జిల్లాలో డీడీలు తీసిన గొల్ల,కురుమలకు నగదు బదిలీ ద్వారా వెంటనే గొర్రెలు(Sheep) పంపిణీ చేయాలని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దయ్యాల నర్సింహ్మ, మద్దెపురం రాజు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య(MLA Ilaiah) ను కోరారు. శుక్రవారం యాదగిరిగుట్టలోని బీర్ల నివాసంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఖాతాలో నగదు జమ చేసి 8 నెలలుగా గొర్రెల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఇంకా 13,715 మంది లబ్ధిదారులు గొర్రెల కోసం ఎదురుచూస్తున్నారని, వారందరికీ నగదు బదిలీ ద్వారా గొర్రెలు పంపిణీ చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు బండారు నర్సింహ, ఉపాధ్యక్షుడు బుడుమ శ్రీశైలం, సహాయ కార్యదర్శులు జోగు శ్రీనివాస్, కొండె శ్రీశైలం, ఎల్లముల సత్యనారాయణ, బుగ్గ చంద్రమౌళి జిల్లా కమిటీ సభ్యులు గుండెబోయిన స్వామి, తెల్దూరి మల్లేష్, జెట్ట చిరంజీవి, కసరబోయిన చంద్రయ్య, వివిధ మండలాల అధ్యక్షులు గంగాదేవి జంగయ్య, తుమ్మేటి బాలకృష్ణ, దేవునూరి బాలయ్య, బొత్త రాములు, పిడుగు బాబు, పసుల సత్యనారాయణ, సంగి రాజు, బుడుమ సురేష్, గుంటి మహేష్, గునబోయిన ఐలయ్య, సిలిగిరి నర్సయ్య పాల్గొన్నారు.