మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలం జమండ్లపల్లి వద్ద శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న గొర్రెలను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో గొర్రెల యజమాని తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యాడు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే గొర్రెలు చనిపోయాయని యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. 20 గొర్రెల మృతితో తీవ్ర నష్టం వాటిల్లిందని బోరున విలపించాడు.