హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)కు సంబంధించి 2020లో నిర్వహించిన ఈ అండ్ ఎం గ్రేడ్-ఈ2 పరీక్షలో మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన బీహార్ రాష్ట్రంలోని మధుబని జిల్లా భిస్నాపూర్ గ్రామానికి చెందిన నిందితుడు శైలేశ్కుమార్ యాదవ్ను సీఐడీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
బ్లూటూత్ ఇతర రిసీవర్ల సాయంతో అసలు అభ్యర్థులకు బదులుగా వేరొకరితో పరీక్షలు రాసిన కేసులో శైలేశ్కుమార్ నిందితుడు. ఇతడు మూడేండ్ల నుంచి బీహార్లోని దర్భంగా జిల్లాలో తలదాచుకుంటున్నాడు. శైలేశ్ అరెస్టుతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 20కి చేరింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన వరంగల్ సీఐడీ పోలీసులకు ఏడీజీ మహేశ్భగవత్ అభినందనలు తెలిపారు.