కవాడిగూడ, ఆగస్టు 6 : రాష్ట్రంలోని పేద విద్యార్థుల చదువులను కాంగ్రెస్ సర్కార్ చులకన చేయడం తగదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి టీ సాగర్ హెచ్చరించారు. రాష్ట్రంలో పెండింగ్ ఉన్న సుమారు రూ.10వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇందిరాపార్క్ వద్ద ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్, రాష్ట్ర నాయకులు డీ కిరణ్, ఎం మమత, అశోక్రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.