ఎల్బీనగర్, జనవరి 27: వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల భూముల జోలికి వస్తే ఊరుకొనేది లేదని రంగారెడ్డి జిల్లా ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి గుండె శివ హెచ్చరించారు. యూనివర్సిటీ భూములను హైకోర్టు నిర్మాణానికి కేటాయించడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంతో జీవవైవిద్యం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, యూనివర్సిటీ భూములనే హైకోర్టుకు కేటాయించడం సరికాదన్నారు. వెంటనే జీవో 55ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు మీసాల స్టాలిన్, వేణు, చంటి పాల్గొన్నారు.