సిటీబ్యూరో, మే 24 ( నమస్తే తెలంగాణ ): సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జలమండలి ఎండీ దాన కిశోర్ ఆదేశించారు. మహానగరంలో ఉత్పత్తయ్యే మురుగునీటిని వంద శాతం శుద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,866.21కోట్ల వ్యయంతో 31 కొత్త సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లను జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఎండీ సమావేశం నిర్వహించారు. ఎక్కువ సామర్థ్యంతో నిర్మిస్తున్న అంబర్పేట, నాగోల్, నల్ల చెరువు, ఫతేనగర్ ఎస్టీపీల నిర్మాణ పనులను ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో జలమండలి ఈడీ డా.ఎం. సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్బాబు, ఎస్టీపీ సీజీఎంలు, జీఎంలు, నిర్మాణ సంస్థల ప్రతినిధుల పాల్గొన్నారు.